తప్పని ఓటమి... కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పద్మావతి

Update: 2019-10-24 05:30 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ప్రతీ రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి వెనుకంజలో ఉండిపోయారు. పట్టున్న మండలాల్లో సైతం వెనుకపడిపోవడంతో నిరాశ చెందారు. తనకు ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News