స్నేహితుల మధ్య గొడవ... ఆర్మీ జవాన్ హత్య

మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఆర్మీ జవాన్ ను హత్య చేసినే సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది.

Update: 2019-10-20 04:29 GMT

మద్యం మత్తులో స్నేహితులు మధ్య జరిగిన  గొడవలో ఆర్మీ జవాన్ ను హత్య చేసినే సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకేలితే వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యారు. మూడు రోజుల క్రితం జవాన్ ప్రేమ్ కుమార్ సెలువుపై తన ఇంటికి వచ్చారు.

రాత్రి బర్త్ డే పార్టీలో స్నేహితుల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో వాళ్ళు ప్రేమ్ కుమార్ ను స్క్రూ డ్రైవర్, కత్తులతో పొడిచారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన ప్రేమ్ కుమార్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. జవాన్ మర్డర్ పై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News