సీఎం ఆఫీస్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనతో కలిసి పర్యటించారు. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామాన్ని సందర్శించి.. వానర వనంలో మొక్కలను పరిశీలించారు. అనంతరం పంచ సూత్రాలపై ఇంటింటికి తిరిగి.. పర్యవేక్షించి, వాటి గురించి వివరించారు ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. సీఎం కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణనె సాధించుకోవాలంటే.. ప్రతి గ్రామంలో పంచ సూత్రాలను తప్పకుండా అమలు చేయాలన్నారు. సానిటేషన్, హరితహారం, తడి పొడి చెత్త, నాప్కిన్స్, ప్లాస్టిక్ నివారణ.. ఇలాంటివి ప్రతి ఇంటిలో ప్రతిరోజు తప్పక పాటించాలి ప్రతి గ్రామంలో వానర వనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.