మిడ్‌ మానేరు పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ఆరా

Update: 2019-08-16 15:05 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన మిడ్‌ మానేరులోకి గోదావరి నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిర్వాసిత మండలమైన బోయినపల్లి మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డికి సిఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఎంతనీరు చేరిందని అడగడంతో పాటు అక్కడి ఏర్పడ్డ సమస్యలపై ఆరా తీశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని కేసీఆర్‌కు స్థానిక నాయకులు తెలిపారు. వెంటనే నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని సమస్యలపై చర్చించి నివేదిక ఇవ్వాలని సిరిసిల్ల కలెక్టర్‌కు కేసీఆర్‌ ఆదేశించారు.  

Tags:    

Similar News