నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ రోడ్డులో చెడ్డీ గ్యాంగ్ ముఠా రెచ్చిపోయారు. ఓ ఇంట్లోకి ఆరుగురు దొంగలు ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని కత్తులతో బెదిరించి 16 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన నివాసాన్ని పరిశీలించారు.