త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
♦ కమ్మర్పల్లిలోని కోనాపూర్ దగ్గర వాగులోకి దూసుకెళ్లిన కారు ♦ కారులోంచి ఐదుగురిని రక్షించిన స్థానికులు ♦ భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలు సురక్షితం
కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.కమ్మర్పల్లి మండలం కోనాపూర్ సమీపంలో అదుపుతప్పి కారు రాళ్లవాగులోకి దూసుకెళ్లింది.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాగులో పూర్తిగా మునిగిపోయిన కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. జగిత్యాల జిల్లా రాయకల్కు చెందిన ఫ్యామిలీ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.