కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రాజాంపేటకు చెందిన ప్రదీప్గౌడ్ మృతి చెందాడు. కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఉగ్రవాయి స్టేజీకి కొద్ది దూరంలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఆటో ఢీకొన్న ఘటనలో ప్రదీప్గౌడ్ మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి విచారిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదానికి ముందు లవ్ ఫెయిల్యూర్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ప్రదీప్. అతి వేగంగా బైక్ నడుపుతూ లవ్ ఫెయిల్యూర్ అంటూ నినాదాలు చేశాడు. సరిగ్గా గంట తర్వాత అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కలచి వేసింది. లవ్ ఫెయిల్యూర్ అయిందంటూ అతను ఏడుస్తూ స్టేటస్ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది. ప్రదీప్ వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.