శాసన సభను టీఆర్ఎస్ పార్టీ సభగా మార్చారన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాగ్ రిపోర్ట్ కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై తప్పు పట్టిందన్నారు. చేసిన అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎద్దేవ చేశారు బీజేపీ లక్ష్మణ్.