ఎంపీ బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత

Update: 2019-10-23 05:56 GMT

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఎంపీ బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన ఎంపీ సంజయ్‌ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. గాడ్సేను దేశ భక్తుడన్న మీరు గాంధీ పేరుతో యాత్ర ఎలా చేస్తారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కలగజేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags:    

Similar News