మేడిగడ్డ బ్యారేజీ 23 గేట్లు ఎత్తివేత

Update: 2019-07-30 07:46 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు.. ఎత్తేశారు. రాత్రి నుంచి వరద ప్రవాహం పెరగడంతో.. 23 గేట్లను ఎత్తేసిన అధికారులు.. 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో పాటు.. ఉపనదుల వెంట భారీగా నీరు చేరడంతో.. మేడిగడ్డ దగ్గర గోదావరి ఉధృతంగా మారింది. దీంతో గతంలో కూడా మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తి.. వరదనీటిని కిందికి వదిలారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తుండటం గోదావరిలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుకుతుండంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలశిరితో కళకళలాడుతోంది. 

Tags:    

Similar News