తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం.... ఉన్న కొద్దిమంది నేతలు కూడా పార్టీ మారేందుకు రంగంసిద్ధంచేసుకుంటున్నారు. పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, కొత్తకోట దయాకర్రెడ్డి, సీతాదయాకర్రెడ్డి, దేవేందర్గౌడ్ కుమారుడు వీరేందర్గౌడ్... తదితరులు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 27, 28 తేదీల్లో... రాంమాధవ్, కిషన్రెడ్డి, లక్ష్మణ్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ వేదికగా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.