ఈఎస్‌ఐ స్కామ్‌లో వెలుగు చూస్తున్న నిజాలు..ఏసీబీ దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభ్యం

Update: 2019-10-03 10:21 GMT

ఈఎస్‌ఐ స్కామ్‌లో మరిన్ని నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ పలు కీలక ఆధారాలు సేకరించింది. గడిచిన నాలుగేళ్లలో వెయ్యి కోట్ల మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ప్రతి ఏటా 250 కోట్ల మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 70 డిస్పెన్సరీల వద్ద ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు పలు మెడికల్ ఏజెన్సీలలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు అనుమానితులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్‌ చేయగా మరికొంత మందిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Tags:    

Similar News