ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో నూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పాండ్య బౌలింగ్లో ఆఖరి బంతిని భారీ షాట్ ఆడిన నీషమ్(12) దినేశ్ కార్తీక్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 41 ఓవర్లు ముగిసే సరికి కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రాస్ టేలర్ 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.