భారత్ ఎదురీత!

Update: 2019-06-30 14:45 GMT

భారీ లక్ష్యం ముందున్నప్పుడు.. ఆరంభంలోనే వికెట్ పడిపోతే.. ఇక బ్యాటింగ్ చేసే జట్టుకు కష్టాలు మొదలైనట్టే. బౌలర్ల ఆత్మా విశ్వాశం రెట్టింపు అయిపోతుంది. సరిగ్గా అదే జరిగింది ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్నా వరల్డ్ కప్ మ్యాచ్ లో. ఆరంభంలోనే ఓపెనర్ రాహుల్ అవుటయిపోయాడు. దీంతో మరో ఓపెనర్ రోహిత్ శ్రమకు కోహ్లీ జత కలిశాడు. ఇన్నింగ్స్ నిలబెట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో టీమిండియా పరుగులు రావడం కష్టమైపోయింది. మొత్తమ్మీద టీమిండియా ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకూ 16 ఓవర్లు పూర్తయిపోయాయి. స్కోరు ఒక వికెట్ నష్టానికి 57 . రోహిత్ 41 బంతుల్లో 23 పరుగులతోనూ, కోహ్లీ 46 బంతుల్లో 34 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 



Tags:    

Similar News