ఇండియన్ యంగ్ టీమ్.. అండర్ 19 వరల్డ్ కప్ ను అందుకునేందుకు రెండడుగుల దూరంలో ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన యువజట్టు.. సెమీస్ లోకి సగర్వంగా అడుగుపెట్టింది. పేస్ బౌలర్ కార్తీక్ సంచలన బౌలింగ్తో విజృంభించగా.. జైస్వాల్, అంకోలేకర్ అర్ధశతకాలు బాదడంతో.. కంగారులు క్వార్టర్స్ నుంచే వెనుదిరిగారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. బౌలింగ్, బ్యాటింగ్లో రాణించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.