టీంఇండియా జట్టుకు త్వరలో కొత్త కోచ్ రానున్నాడు . దీనికోసం త్వరలో బీసీసీఐ నుండి ఓ ప్రకటన వెలువడనుంది .. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్టు పూర్తి అయింది . మళ్ళీ కోచ్ గా కొనసాగాలి అనుకుంటే అయన కూడా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే .. అయితే భారత్ కి వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్ ఉంది . దీనికి మాత్రం రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరిస్తారు . అందుకోసం రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల కాంట్రాక్టును మరో 45 రోజులు పొడిగించారు .. సెప్టెంబర్ 15 న స్వదేశంలో భారత్ దక్షిణాప్రికా జట్టుతో మ్యాచ్ ఆడనుంది . అప్పటి వరకు కొత్త కోచ్ ని నియమించాలని అనుకుంటున్నట్లు అందువల్లే త్వరలో దరఖాస్తులకి ఆహ్వానించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అనిల్ కుంబ్లే తర్వాత టీంఇండియా జట్టుకు రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరించారు ..