హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్..ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఓపెనర్లు వాట్సన్(31), డుప్లెసిస్(45), పరుగులతో మంచి ఆరంభం అందించినా..తర్వాత వచ్చిన బ్యాట్సమెన్స్ సురేశ్ రైనా 13, రాయుడు 25, జాదవ్ 1, జడేజా 10 పరుగులకే పరిమతమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, విజయ్ శంకర్ 1, నదీమ్ 1, అహ్మద్ ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్స్టో (44 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. తాహిర్కు 2 వికెట్లు దక్కాయి. వార్నర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.