వన్డే వరల్డ్కప్లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్ని నిలిపివేశారు. ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.