వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో భాగంగా సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ తో హోరాహోరీగా తలపడుతోంది. విజయ లక్ష్యం 331 తో బరిలోకి దిగిన సఫారీలు నిదానంగా ఆడుతున్నారు. ఓపెనర్ డికాక్ అవుటయ్యాకా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఫా డు ప్లెసిస్ దూకుడుగా ఆది అర్థ సెంచరీ సాధించాడు. ఇదే క్రమంలో మెహిది హాసన్ వేసిన 27వ ఓవర్లో క్లీన్బౌల్డయ్యాడు.తరువాత నుంచి సఫారీలు నిదానంగా ఆడటం మొదలు పెట్టారు. డేవిడ్ మిల్లర్ , వాన్ డర్ డుస్సెన్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. షకిబ్ వేసిన 30వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ను సౌమ్య సర్కార్ వదిలేయడం తో బతికిపోయాడు. దక్షిణాఫ్రికా జట్టు 32 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.