చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న ఫైనల్లో ముంబయి ఇండియన్స్బ్యాటింగ్ లో నెమ్మదించింది. వరుసగా ఓపెనర్లు అవుట్ కావడంతో ఆచి తూచి ఆడుతోంది. తొలుత భారీ షాట్లతో విజృంభించి ఆడతున్న ఓపెనర్ క్వింటన్ డికాక్ (29; 17 బంతుల్లో 4×6)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. ఐదో ఓవర్ చివరి బంతిని ఆడబోయిన డికాక్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. దీపక్ చాహర్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ (15; 14 బంతుల్లో 1×4, 1×6) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ముంబయి నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (7; 10 బంతుల్లో), ఇషాన్ కిషన్ (5; 13 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు. వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క చెన్నై బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.