శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తన వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే . అయితే మలింగ రిటైర్మెంట్ పైన భారత వైస్ కెప్టెన్ మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అధికార ట్విట్టర్ ద్వారా స్పందించాడు . గత దశాబ్ద కాలంగా మా(ముంబై ఇండియన్స్ ) టీం మ్యాచ్ విన్నర్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడని కెప్టెన్ గా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అతను నాకు చాలా సార్లు అండగా నిలిచాడని రోహిత్ అన్నాడు .
If I had to pick one match winner among many others for @mipaltan in the last decade, this man will be on the top for sure. As a captain he give me breather during tense situation and he never failed to deliver, such was his presence within the team. Best wishes LM for the future pic.twitter.com/gJJJKy8gL3
— Rohit Sharma (@ImRo45) July 26, 2019
ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా విజయాలను అందిచాడని రోహిత్ పేర్కొన్నాడు . భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని రోహిత్ పేర్కొన్నాడు.మలింగ బంగ్లాదేశ్తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు.