మా విన్నర్ మలింగనే .. రోహిత్ శర్మ

Update: 2019-07-27 12:21 GMT

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ తన వన్డే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే . అయితే మలింగ రిటైర్మెంట్ పైన భారత వైస్ కెప్టెన్ మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అధికార ట్విట్టర్ ద్వారా స్పందించాడు . గత దశాబ్ద కాలంగా మా(ముంబై ఇండియన్స్ ) టీం మ్యాచ్ విన్నర్ లో మలింగ ముందు వరుసలో ఉంటాడని కెప్టెన్ గా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అతను నాకు చాలా సార్లు అండగా నిలిచాడని రోహిత్ అన్నాడు .



ముంబై ఇండియన్స్ జట్టుకు చాలా విజయాలను అందిచాడని రోహిత్ పేర్కొన్నాడు . భవిష్యత్తులో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని రోహిత్ పేర్కొన్నాడు.మలింగ బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు.

Tags:    

Similar News