టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తన సత్తా చాటాడు. విశాఖలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లోనూ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు కొనసాగించాడు. సపారీ బౌలర్లపై ఆధిక్యం కొనసాగించాడు. 133 బంతుల్లో శతకాన్ని పూర్తిచేశాడు. టెస్టుల్లో ఓపెనర్గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. రోహిత్ కెరీర్లో వైజాగ్ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. సుధీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్గా సంచలన ప్రదర్శన చేసి కెరీర్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్(105), జడేజా(8) క్రీజులో ఉన్నారు.