లీడ్స్ : లీడ్స్ వేదికగా నిన్న శ్రీలంక జట్టుతో జరిగిన చివరీ లీగ్ మ్యాచ్ లో భారత బాట్స్ మన రోహిత్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు .. ఈ క్రమంలోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు .. ఇప్పటివరకు ఆడినా ఎనమిది మ్యాచ్ లో రోహిత్ అయిదు సెంచరీలు చేసి సచిన సరసన చేరాడు .. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సెంచరీ కొట్టగానే అయన భార్య రితికా తన కుమార్తెను చూపిస్తూ ఎమోషన్ కి గురి అయ్యారు .. 2017 లో శ్రీలంక జట్టుపై రోహిత్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే . అయితే అ రోజు వారి పెళ్లి రోజు కావడంతో రోహిత్ అ డబుల్ సెంచరీని తన భార్యకు కానుకగా ఇచ్చాడు . ఇప్పుడు అదే జట్టుపై సెంచరీ కొట్టడంతో అదే ఆనందానికి వారి కుమార్తె కూడా తోడైంది .. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ..
A very special Hundred for @ImRo45 and saimara cheering for dad. What a moment 😍😍.#RohitSharma #INDvSL pic.twitter.com/Xg9D6JGQTP
— Sampath Reddy (@sampathreddy815) July 6, 2019