తన విజయంలో గోపీచంద్ సార్ కృషి ఎంతో ఉందని ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు అన్నారు. చాలా కాలం నుంచి కంటున్న కల నెరవేరిందని సింధు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న సింధుతో పాటు కాంస్యం సాధించిన సాయి ప్రణీత్ హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల నెరవేరిందని సింధు తన ఆనందాన్ని పంచుకున్నారు. గతంలో సెమీస్లో ఓడిపోయినప్పుడు సమీక్ష చేసుకున్నా. ఫైనల్ మ్యాచ్ కూడా మామూలుగానే తీసుకున్నా. క్వార్టర్, సెమీస్ మ్యాచ్ల్లాగే ఫైనల్లో ఆడా. అయితే ఫైనల్లో తొలి నుంచే ఒకుహరపై పైచేయి సాధించా. ఫైనల్లో ఒకుహరాపై గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నట్లు సింధు తెలిపారు. కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ 'పతకాలు సాధించిన సింధు, సాయి ప్రణీత్కు అభినందనలు. ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించాలనే నా కలను సింధు నిజం చేసింది. ఒలింపిక్స్లో బంగారు పతకం లక్ష్యంగా సింధు సిద్ధమవుతోంది. గత ఒలింపిక్స్ చివరి మెట్టుపై సింధు కాస్త తడబడింది. సింధు 2020 విజన్తో ముందుకెళ్తోంది. క్రీడాకారులకు మంచి కోచింగ్ ఇస్తున్నామని' పేర్కొన్నారు.