రాజ్‌భవన్‌లో సింధును సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2019-08-28 12:11 GMT

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పి.వి సింధును తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను పి.వి సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. తల్లిదండ్రులతో కలిసి తన ఆనంద క్షణాలను పంచుకున్నారు. గరవర్నర్‌ దంపతులు సింధును అభినందించారు. అనంతరం పారా షట్లర్ మానసి జోషిని గవర్నర్ నరసింహన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీ సింధు కుటుంబసభ్యులు, పలువురు క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:    

Similar News