పీవీ సింధుకి అభినందనలు తెలిపిన రాజకీయ ప్రముఖులు

Update: 2019-08-25 14:28 GMT

పివి సింధు ప్రపంచ బ్యాడింటన్ క్రీడలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో రెండు సార్లు గోల్డ్‌ ఛాన్స్ మిస్సయిన సిందు ఈ సారి సత్తా చాటింది. బంగారు పతకాన్ని సాధించింది.ఆట మొదలైన దగ్గర నుంచి ఎక్కడా తడబడకుండా అదే దూకుడు ప్రదర్శించింది. ఫైనల్‌ ఫోబియాను అధిగమించి తన గేమ్‌ స్టాటజీస్‌తో ప్రత్యర్ధి ఒకుహరాను ముప్పతిప్పలు పెట్టింది. వరుస సెట్లలో గేమ్‌ సొంతం చేసుకుంది. ప్రపంచ విజేతగా అవతరించింది. గతంలో రెండు సార్లు ఫైనల్‌లో ఓటమి చెందిన సింధు...ఈ సారి ఏకాగ్రతను కోల్పోకుండా ఫుల్‌ ఫోకస్‌తో ఆడింది. గోల్డ్ మెడల్‌ సొంతం చేసుకుంది. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి బంగారు పతకాన్ని సాధించిన సింధూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 



Tags:    

Similar News