ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో నూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన 44.4వ బంతికి కొలిన్ డి గ్రాండ్హోమ్ (16; 10 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. ధోనీ క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 44.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. రాస్ టేలర్, టామ్ లాథమ్లు క్రీజులో ఉన్నారు.