ఇండియన్ క్రికెట్ ఆటగాళ్ళ జెర్సీపైన బ్రాండ్ మారనుంది . వచ్చే నెల వెస్టిండిస్ జట్టుతో జరగనున్న టూర్ వరకే కోహ్లి సేన జెర్సీ పైన ఒప్పో బ్రాండ్ కనిపిస్తుంది . అ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే సిరీస్ లో భాగంగా ఇండియన్ టీం జెర్సీ పైన ఒప్పోకి బదులు బైజుస్ అనే బ్రాండ్ కనిపించనుంది . 2017 మార్చి నుండి ఒప్పో టీంఇండియా స్పాన్సర్షిప్ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తాజాగా ఈ స్పాన్సర్షిప్ను రద్దు చేసుకుందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది . అయితే అంతే మొత్తంలో చెల్లించేందుకు బైజుస్ అనే సంస్థ ముందుకు వచ్చిందని సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ స్పాన్సర్షిప్ చేస్తుందని తెలిపింది.