సూపర్‌కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై

Update: 2019-04-27 07:09 GMT

సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్ తగిలింది. ధోనీ గైర్హాజరీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుచేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ సీజన్‌లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. సాన్‌ట్నర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 17.4 ఓవర్లలో 109 పరుగులే చేసి ఆలౌటైంది. మురళీ విజయ్‌ (35 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మె రుగ్గా ఆడాడు. మలింగ 4 వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌ శర్మకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

Similar News