విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జోరు కొనసాగుతుంది. తొలి రోజు రోహిత్ శర్మ సెంచరీతో అదరగొడితే రెండో రోజు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీతో సత్తా చాటాడు. అయితే.. 176 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్న రోహిత్ శర్మను కేశవ్ మహరాజ్ బౌలింగ్లో డీ కాక్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో రోహిత్ డబుల్ సెంచరీ మిస్ అయిందని అభిమానులు నిరాశ చెందారు. ఓపెనర్లు ఇద్దరూ 317 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని అందించారు.