పంజాబ్ అద్భుత విజయం

Update: 2019-04-02 01:21 GMT

ఐపీఎల్‌లో పంజాబ్‌ వరుస విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 14 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. మిల్లర్(43), సర్ఫరాజ్‌ఖాన్(39) రాణింపుతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 166/9 స్కోరు చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 152 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. ఛేదనలో పృథ్వీ షా గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ధావన్‌(30), అయ్యర్‌(28), ఇన్‌గ్రామ్‌(38), పంత్‌(39)లు రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. గెలుపు దగ్గరి వరకు వచ్చిన ఢిల్లీని చివర్లో పంజాబ్‌ బౌలర్లు అడ్డుకున్నారు. చివర్లో వరుసగా వికెట్లు తీసి పంజాబ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. 

Similar News