రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ ఔట్‌..

Update: 2019-07-10 10:25 GMT

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. టాప్ ఆర్డ‌ర్‌లో రోహిత్‌, విరాట్, రాహుల్‌ వికెట్ల‌ను కోల్పోయింది. అయిదు ప‌రుగుల‌కే ఇండియా మూడు కీల‌క వికెట్ల‌ను చేజార్చుకున్న‌ది. బంతి విపరీతంగా స్వింగ్ అవుతుండడం కివీస్‌కు కలిసి వస్తోంది. నాలుగు పరుగుల వద్ద రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, ఆ వెంటనే రాహుల్ (1) హెన్రీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 5 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News