ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు కసున్ రజిత అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు.. నాలుగు ఓవర్లు వేసినా కసున్ రజిత మొత్తం 75 పరుగులు ఇచ్చాడు. మొదటి ఓవర్లో 11 పరుగులు,రెండో ఓవర్లో 21 పరుగులు, మూడో ఓవర్లో 25 పరుగులు, నాలుగో ఓవర్లో 18 పరుగులు ఇచ్చాడు. ఆసీస్ బాట్స్ మెన్స్ ఇతని బౌలింగ్ లో పరుగుల వరదని పారించారు. ఈ మ్యాచ్ లో ఆసీస్ బాట్స్ మెన్స్ వార్నర్, కెప్టెన్ అరోన్ ఫించ్ భారీ స్కోర్స్ చేసారు. దీనితో నిర్ణిత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 234 పరుగుల చేసింది . ఇక ఆ తర్వాత లక్ష్య చేదనకి బరిలోకి దిగిన శ్రీలంక తొమ్మది వికెట్లను కోల్పోయి 99 పరుగులను మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్ లో శతకంతో అదరగొట్టిన వార్నర్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది.