ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో నూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్ధశతకం సాధించిన కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. చాహల్ వేసిన 35.2వ బంతి అతడి బ్యాట్ అంచుకు తాకి జడేజా చేతుల్లో పడింది. కీలక సమయంలో విలియమ్సన్ పెవిలియన్ చేరడం కివీస్కు పెద్ద ఎదురుదెబ్బే. 36 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్, రాస్ టేలర్ (26) క్రీజులో ఉన్నారు.