New Zealand vs India, 1st T20 : భారత్ ఘన విజయం

Update: 2020-01-24 10:29 GMT

భారత జట్టు తన విజయపరంపరను కొనసాగిస్తుంది. ఈరోజు ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన కివీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ కొలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు.

ఇక 204 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన కోహ్లి (45) మరో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌(56)తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పని పెట్టుకున్నడు, 2వీరిద్దరూ రెండో వికెట్‌కు గాను 98 పరుగుల భాగస్వామ్యం జోడించారు.ఆ తర్వాత ఇద్దరు 6 పరుగుల తేడాతో బెటయ్యారు. ఈ క్రమంలో శ్రేయన్‌ అయ్యర్‌(58), మనీశ్‌ పాండే(14) చివరివరకు ఉండి జట్టును గెలిపించారు.

Tags:    

Similar News