వెస్టిండీస్తో మొన్న జరిగిన తొలి వన్డేలో ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు ఆ పరువును కాపాడుకునే దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకూ విశాఖపట్నం వేదికగా ఎన్నో మ్యాచ్ లను ఆడి విజయాన్ని కైవసం చేసుకున్న ఇండియా రెండో వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మొత్తం మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ రోజు వైజాగ్ లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆటలో టీమిండియా ఓడితే తన సిరీస్ను కోల్పోతుంది. అందుకే ఏది ఏమైనా ఈ మ్యాచ్ను గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉంది.
కాగా ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కి టాస్ వేయగా వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇంకేముంది మొన్నటిలాగే టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ రోజు జట్టులో శివం దుబే స్థానంలో శార్దుల్ ఠాకూర్ను కోహ్లీ జట్టులోకి తీసుకున్నాడు. ఇండియా గెలుపు కోసం విశాఖపట్నం ప్రజలు ఎంతగా ఎంకరేజ్ చేస్తారో చూడాల్సిందే.