విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా, ఇండియా తొలి టెస్ట్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్తో పాటు.. పిచ్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఇక దసరా సెలవులు కావడంతో విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు.. విశాఖ స్టేడియం అధికారులు ప్రకటించారు. స్కూల్ లేదా కాలేజీ ఐడీ కార్డు చూపించి ఉచితంగా క్రికెట్ను వీక్షించొచ్చని తెలిపారు. ఇక 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. నిన్న వర్షం పడ్డా.. నెట్ ప్రాక్టీస్కు గ్రౌండ్ను త్వరితగతిన సిద్ధం చేయడంతో.. ఇరుజట్లు ప్రాక్టీస్ చేశాయి.