రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం

Update: 2019-01-26 09:35 GMT

న్యూజిలాండ్‌‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 324 పరుగులు చేసింది అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కివీస్‌ తడబడింది. తొలి సగంలో బ్యాట్స్‌మెన్‌, తర్వాత బౌలర్లు రాణించడంతో కోహ్లీసేనకు సునాయాస విజయం దక్కింది. కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు వికెట్లు, చాహల్‌, భువి చెరో రెండు వికెట్లు, షమీ, జాదవ్‌ చెరో వికెట్‌ తీయడంతో కివీస్ 234 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

Similar News