భారత్కు రెండు ప్రపంచకప్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఈ ప్రపంచకప్లో భారత్ ఆడే చివరి మ్యాచే ధోనీకి కూడా చివరిది కానుందా? అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి ధోనీ ఇప్పటికే సమాచారం అందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్టుల నుంచి వైదొలగిన ధోనీ ఈ ప్రపంచకప్లో భారత్ ఆడే చివరి మ్యాచ్తో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రపంచకప్లో భారత్ ఇప్పటికే సెమీ-ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్ మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్ చేరితే ఈ నెల 14న లార్డ్స్ వేదికగా జరుగబోయే ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ మ్యాచ్తోనే క్రికెట్కు స్వస్తి చెప్పాలని ధోనీ భావిస్తున్నాడట.
37 ఏళ్ల ధోనీ ఈ ప్రపంచకప్లో సరైన ఆటతీరు ప్రదర్శించలేకపోతున్న సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో అటు మాజీ ఆటగాళ్ల నుంచి ఇటు అభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వార్మప్ మ్యాచ్ల్లో అదరగొట్టినప్పటికీ అసలైన మ్యాచ్ల్లో తేలిపోతున్నాడు. సచిన్, గంగూలీ వంటి దగ్గజాలు కూడా ధోనీని విమర్శించారు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.