టీమిండియా ఆరో వికెట్ను కోల్పోయింది. దీంతో 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. శాంట్నర్ వేసిన 30.3వ బంతికి హార్దిక్ పాండ్య (32; 62 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. విలియమ్సన్ క్యాచ్ అందుకున్నాడు. ప్రసుత్తం క్రీజులో ధోని(10)తో పాటు జడేజా(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 148 పరుగుల చేయాలి. దీంతో గెలుపు భారమంతా ధోని పైనే ఉంది.