ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్ కుమార్‌ బెనర్జీ ఇక లేరు..

ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్ కుమార్‌ బెనర్జీ కన్నుమూశారు

Update: 2020-03-20 14:14 GMT
Pk. Banerjee (file photo)

ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రదీప్ కుమార్‌ బెనర్జీ కన్నుమూశారు.. 83 సంవత్సరాలు ఉన్న ప్రదీప్ కుమార్‌ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్నారు, దీనితో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తన నివాసం అయిన కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. భారత జట్టు కెప్టెన్ గా చాలా విజయాలను అందించారు.

ఇక ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన్‌గా చేసిన అయన 65 గోల్స్‌ సాధించారు. కెప్టెన్ గా కాకుండా కోచ్ కూడా పనిచేశారు. ప్రదీప్ కుమార్‌ బెనర్జీ మరణం యావత్‌ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. అయన మరణం పట్ల భారత మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంతాపం తెలిపారు. బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Tags:    

Similar News