కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూకడుతున్నారు. రోహిత్ శర్మ (1) అవుట్తో ప్రారంభమైన వికెట్ల పతనం కొనసాగుతోంది. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్నీ బౌలింగ్లో నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్(6; 25బంతుల్లో) వెనుదిరిగాడు. దీంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు.