Shikhar Dhawan: కర్ర పట్టుకొని మరీ ధావన్‌ను టాయ్‌లెట్‌ కడిగించిన ఆయేషా

Update: 2020-03-25 08:41 GMT

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో 100 కోట్ల భారతీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఇళ్లల్లో ఉండిపోయారు. దీంతో వాళ్ళు ఇళ్లల్లో ఏం చేస్తున్నారో వీడియోలు తీసు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన భార్య ఆయేషాతో కలిసి   భారత క్రికెట్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌  ఫన్నీ వీడియో తీసుకున్నాడు. ఆమె కర్ర పట్టుకుని మందలిస్తుండగా ధావన్‌ ఆమెకు భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోనులోనూ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు ఆయేషా కనపడుతుంది. అన్ని పనులు భర్తకు చెబుతూ ఆమె మేకప్‌ వేసుకుంటోంది.






Tags:    

Similar News