అద్భుతమైన సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ 32 వ ఓవర్లో బంతిని ఆడబోయి రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ ను కోల్పోయినట్టయింది. ఓపెనర్లిద్దర్నీ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 32 ఓవర్లు ముగిసేసరికి 205 పరుగులు చేసింది. రూట్ 22 పరుగులతోనూ, మోర్గాన్ పరుగులు లేకుండానూ క్రీజులో ఉన్నారు.