రాహుల్ అవుట్ : దక్షిణాఫ్రికాతో టెస్టు సీరిస్ కి జట్టును ఎంపీక చేసిన బీసీసీఐ
ఇటివల వెస్టిండిస్ జట్టుతో మంచి విజయాలను అందుకున్నా టీం ఇండియా జట్టు ఇప్పుడు అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టెస్టుల సిరీస్ సిద్దం కానుంది , అందులో భాగంగానే 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించారు. .. వెస్టిండిస్ టూర్ లో ఘోరంగా ఫెయిల్ అయిన రాహుల్ ని పక్కన పెట్టేసారు సెలక్టర్లు ...అతని స్థానంలో శుభమన్ గిల్ కి ఛాన్స్ ఇచ్చారు . అంతేతప్ప వెస్టిండీస్తో ఆడిన టెస్టు జట్టుని అలానే కొనసాగించారు. అక్టోబరు 2 విశాఖపట్నంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది . ఆ తర్వాత 10 న పుణె వేదికగా రెండో టెస్టు, 19న రాంచీలో మూడో టెస్టు జరుగుతుంది .
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (రెండో వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్