ICC Women's T20 World Cup 2020 : వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి

Update: 2020-03-08 10:25 GMT
Australia

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. దీనితో ఆ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఇక వరుస విజయాలతో ఫైనల్ కి చేరిన భారత్ రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

దీప్తి (33), హర్మన్‌ప్రీత్‌ (4), స్మృతి మంధాన (11), జెమిమా (0), షెఫాలీ వర్మ(2), వేదా (19), శిఖ పాండే (1), రీచా(18),రాధా (1) పరుగులు చేశారు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ అన్ని విభాగాల్లో రాణించి మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది

Tags:    

Similar News