India vs Australia, 2nd ODI : ఆసీస్ విజయలక్ష్యం 341 పరుగులు

Update: 2020-01-17 12:21 GMT

రాజ్ కోట్ వన్డే లో భారత్ ఆరు వికెట్లను కోల్పయి నిర్ణిత 50 ఓవర్లలో 340 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి భారత్ కి బ్యాటింగ్ కి అప్పజెప్పింది ఆసీస్ .. బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకి ఓపెనర్స్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ వెనుదిరిగినప్పటికీ ధావన్ మాత్రం కోహ్లితో కలిసి స్పీడ్ గానే ఆడాడు .. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం మరింత దూకుడు పెంచాడు ధావన్ .. ఈ క్రమంలో 96(90) వ్యక్తిగత పరుగులు వద్ద అవుట్ అయ్యాడు.. ధావన్, కోహ్లి కలిసి 103 పరుగుల జోడించారు.

ఇక ఆ తరవాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 7 (17) నిరాశపరిచాడు. ఇక కేయల్ రాహుల్ తో కలిసి జత కట్టిన కోహ్లి మరింత దూకుడు పెంచాడు . ఈ క్రమంలో జంపా వేసిన 43 ఓవర్ లోని మొదటి బంతికి భారీ షాట్ ఆడబోయిన కోహ్లి 78 (76) బౌండరీ వద్ద స్టార్క్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కి 78 పరుగులు జోడించారు. ఇక చివరిలో కేయల్ రాహుల్ 80 (58), రవీంద్ర జేడేజా దూకుడు పెంచడంతో భారత్ 340 పరగులు చేయగలిగింది. ఇక ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా మూడు వికెట్లు సాధించగా, కేన్‌ రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీశాడు.  

Tags:    

Similar News