ఐసీసీ ప్రపంచకప్లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా టీం ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో అప్గానిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆఫ్గనిస్థాన్ కెప్టెన్ గుల్బదిన్ నయీబ్ (42 బంతుల్లో 27 పరుగులు, 2 ఫోర్లు) ఔటయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 67 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. రహ్మత్ షా (36 బంతుల్లో 17 పరుగులు, 1 ఫోర్), హష్మతుల్లా షాహిది (7 బంతుల్లో 1 పరుగు)లు క్రీజులో ఉన్నారు.