ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్(55) అర్ధశతకం అందుకున్నాడు. రుబేల్ బౌలింగ్లో రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా తరలించి రెండు పరుగులు రాబట్టి.. రాహుల్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా ఇండియా 117 పరుగులు చేసింది. రోహిత్(58), రాహుల్(55) జోడీ భారీ భాగస్వామ్యం నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది. ఈ జోడీని విడదేసేందుకు బంగ్లా బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.