లక్కంటే మనోడిదే : ₹23 కోట్ల లాటరీ తగిలింది.

Update: 2019-10-06 03:55 GMT

అదృష్టం చెప్పిరాదు.. దురదృష్టం చెప్పి పోదు అంటారు పెద్దలు. కర్ణాటకలోని మహ్మద్​ ఫయాజ్​కి మాత్రం చిన్నతనం నుండి అన్ని దురదృష్టాలే వెంటాడాయి. తన కన్న తల్లిదండ్రులిద్దరూ కిడ్నీ జబ్బుతో చనిపోయారు. ఇక మంచిగా చదువుకొని దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేసుకొని గొప్పగా బ్రతకాలి అనుకున్నాడు. కానీ అది కూడా ఓ కలలాగే మిగిలిపోయింది. ప్రస్తుతం ముంబైలోని ఓ కంపెనీలో అకౌంటెంట్ గా జాబు చేస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి మనల్ని కూడా అదృష్టం వరించకుండా పోతుందా అని ఎదురుచూసాడు. అలా ఆరు సార్లు లాటరీ టికెట్ కొన్నాడు. చివరగా అతడిని అదృష్టం వరించింది. ఏకంగా ఆ లాటరీలో ₹23 కోట్లు తగిలాయి. వచ్చినా డబ్బుతో తన సోదరుడుని చదివిస్తానని సంతోషంగా చెపుతున్నాడు మహ్మద్​ ఫయాజ్...  

Tags:    

Similar News